Monday, April 29, 2024

పిల్లలకు విషం ఇచ్చి ఉరివేసుకున్న తల్లి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన తల్లి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం బోరబండంలో చోటుచేసుకుంది. భార్య, పిల్లల మృతిని తట్టుకోలే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బోరబండ, రాజ్‌నగర్‌కు చెందిన జ్యోతి(31) ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు అర్జున్(4), ఆదిత్య(2) ఉన్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. ఏమి జరిగిందో కానీ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ వారి మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బోరబండ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News