Friday, April 26, 2024

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపి రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నూతన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని కలిసిన ఎంపి రంజిత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని మంత్రికి వివరించిన ఎంపి

ఢిల్లీ: నూతన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను ఢిల్లీలో గల కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ గ్రామీణాభివృద్ధికి చేస్తున్న కృషిని వారికి వివరించారు. పల్లె ప్రగతి, హరితహారం లాంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు.  సిఎం కెసిఆర్ ఆలోచనలకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనితనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందని మంత్రి గిరి రాజ్ సింగ్ కి ఎంపి రంజిత్ రెడ్డి వివరించారు. అలాగే తన పార్లమెంటు పరిధిలోని రాజేంద్ర నగర్ లో గల’ జాతీయ గ్రామీణ అభివృద్ధి – పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్ డి & పిఆర్)’ సంస్థ కార్యాలయానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News