Monday, April 29, 2024

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి,ఎంల్ఎ దానం నాగేందర్‌

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌కు మరో ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారికి సిఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

కాగా, ఈ ఉదయమే పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పిన దానం నాగేందర్,రంజిత్ రెడ్డిలు ఒకేసారి బిఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వడం భారీ దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది. కాగా, గ్రేటర్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్‌కు దానం నాగేందర్ తొలి అధికార పార్టీ ఎమ్మెల్యే కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News