ధోనీ ఆ రాత్రంతా ఏడ్చాడు: రవిచంద్రన్ అశ్విన్
చెన్నై: భారత క్రికెట్కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీది ప్రత్యేక స్థానమని, అతనిలాంటి వారు చాలా అరుదైన లభిస్తారని స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి అశ్విన్ అభినందనలు తెలిపాడు. భారత క్రికెట్పై చెరగని ముద్రవేసిన ఘనత ధోనీకి మాత్రమే దక్కుతుందన్నాడు. ఇక టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు టీమ్ జెర్సీని ధరించిన ధోనీ రాత్రంతా ఎడుస్తూనే ఉన్నాడన్నాడు. తాము ఎంత ఒదార్చినా అతని కన్నీళ్లు ఆగలేదని అశ్విన్ పేర్కొన్నాడు.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ చాలా సార్లు భావోద్వేగానికి గురయ్యేవాడన్నాడు. టెస్టులకు వీడ్కోలు పలికిన రాత్రి ధోనీని సముదాయించడం తమకు చాలా కష్టంగా మారిందని అప్పటి సంఘటనను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఇక కెప్టెన్గా, వికెట్ కీపర్గా జట్టుపై ధోనీ బలమైన ముద్ర వేశాడన్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని బ్యాటింగ్ జట్టుకు చాలా కీలకంగా ఉండేదన్నాడు. ఎన్నో మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించిన ఘనత ఒక్క ధోనీకి మాత్రమే దక్కుతుందన్నాడు. ఇక మహి లాంటి ఆటగాడు భారత్కు దొరకడం అనుకున్నంత తేలికకాదన్నాడు. యువ ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించ డంలో ధోనీ సదా ముందుండే వాడని అశ్విన్ వివరించాడు.
MS Dhoni worse entire night after test retire: Ashwin