Friday, April 26, 2024

ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సిబిఐ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాన్నారు. అందులో పేర్కొని ఉ న్న నిందితుల జాబితాను కూడా చూశానని పేర్కొన్నారు. దానిలో తన పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నానని కవిత పే ర్కొన్నారు. కేసులో క్లారిఫికేషన్ కోసం ఇచ్చిన నోటీసులపై క విత ప్రతిస్పందిస్తూ, సిబిఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఇటీవల సిబిఐకి లేఖ రాసిన విష యం విధితమే.

దానికి స్పందించిన అధికారులు ఈ-మెయిల్ ద్వా రా ఆమెకు సమాధానమిస్తూ, ఎఫ్‌ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉన్నదని తెలిపారు. దాంతో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని ఆమె సోమవారం ఉదయం సిబిఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. కాగా ముందే ఖరారైన కా ర్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సిబిఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News