Monday, May 6, 2024

హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం

- Advertisement -
- Advertisement -

మదర్ డైరీ ని లాభాల బాటలో నడిపిస్తాం

ఇప్పటికే విజయ డైరీని బలోపేతం చేశాం: మంత్రి  కెటిఆర్

మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కెటిఆర్ ను కలసిన నార్ముల్ డైరెక్టర్లు

అభినందించిన మంత్రి కెటిఆర్

Narmul directors meet with KTR

హైదరాబాద్: తెలంగాణలో హరిత విప్లవం తో పాటు క్షీరవిప్లవం మొదలైందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కలవకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీరు అందుబాటులోకి రావడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నార్ముల్ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్ లో మంత్రి కెటిఆర్ ను కలసి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఇద్దరు మహిళా డైరెక్టర్లతో పాటు మంగళవారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు డైరెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.

మదర్ డైరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే విజయ డైరీని రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని కెటిఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అందులో ముఖ్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ఏర్పడిన రోజు నుంచి సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు విజయ డైరీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని అటువంటి డైరీని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నార్ముల్ కు ఎన్నికయిన కొత్త డైరెక్టర్లు కర్నాటి జయశ్రీ, అలివేలు, కోట్ల జలందర్ రెడ్డి, రచ్ఛా లక్ష్మి నరసింహా రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి,  చల్లా సురేందర్ రెడ్డి లతో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లతో పాటు శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నోములభగత్, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులుకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News