- Advertisement -
బ్రిస్బేన్: భారత యువ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్ చరిత్ర సృష్టించాడు. నెట్ బౌలర్గా విదేశీ పర్యటనకు వచ్చి మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్గా నటరాజన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నటరాజన్ తాజాగా గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా టెస్టులకు కూడా శ్రీకారం చుట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ను ఆరంభించిన నటరాజన్ టి20 సిరీస్లో కూడా ఆడాడు. ఇక కీలక బౌలర్లు గాయపడడంతో తాజాగా టెస్టుల్లో కూడా అడుగుపెట్టాడు. ఇలా నెట్బౌలర్గా ఆస్ట్రేలియాకు వచ్చి మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
- Advertisement -