Thursday, May 16, 2024

జులై 17,18 తేదీల్లో జాతీయ సివిల్ ఇంజనీర్ల సదస్సు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో సివిల్ ఇంజనీర్ల జాతీయ సదస్సు జులై 17, 18 తేదీల్లో హెచ్‌ఐసిసిలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కె. రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 600 మంది ప్రతినిధులు, 14 మంది అంతర్జాతీయ, జాతీయ వక్తలు ఎనిమిది దేశాల నుండి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ప్రభుత్వం వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సంవత్సరానికి దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తుందని, సివిల్ ఇంజనీర్లు జాతీయ బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లు వంతెనలు, రోడ్లు, విమానాశ్రయాలు, గృహాలు, ఆసుపత్రులు, ఉద్యానవనాలు, సొరంగాలు, స్టేడియంలు ఎవరైనా ఊహించగలిగే ప్రతిదాన్ని నిర్మించడం ద్వారా ప్రపంచాన్ని మరింత జీవించగలిగేలా చేస్తారని వెల్లడించారు. అనంతరం డాక్టర్ రంగారావు వివరిస్తూ రాబోయే ఐదేళ్లలో ఆకాశహర్మ్యాల సంఖ్యలో ముంబైని అధిగమించడానికి హైదరాబాద్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.

నగరంలో త్వరలో 100కు పైగా ఎత్తైన భవనాలు రానున్నాయని ఆయన తెలిపారు. భూకంపాలకు సంబంధించినంత వరకు హైదరాబాద్‌లో స్థిరమైన, సురక్షితమైన భూమి ఉందని, మనకు ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఇక్కడ నిర్మాణం చాలా చౌకగా ఉందని, ముంబైకి అవసరం ఉంది, కానీ భూమి లేదు. హైదరాబాద్‌కు భూమి, ఆకాంక్షలు ఉన్నాయి. డిమాండ్ కూడా ఉందన్నారు.ఈకార్యక్రమంలో జే మార్షల్ స్ట్రాబాలా, డాక్టర్ నవీద్ అన్వర్, డాక్టర్ జియోఫ్ చావో, జియా ఉద్దీన్, మహేష్ అరుముగం, ప్రొ. సురేష్ నారాయణ, గోపకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News