Tuesday, April 30, 2024

రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌మిట్టల్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న నవీన్‌మిట్టల్, ఐఏఎస్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వాకాటి కరుణ, ఐఏఎస్, విద్యాశాఖ కార్యదర్శికి అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిఓ ఆర్‌టి 868లో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్, భూ భారతి వంటి శాఖలకు కమిషనర్‌గా నవీన్‌మిట్టల్‌కు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్టు సిఎస్ ఆ జిఓలో పేర్కొన్నారు.

నవీన్‌మిట్టల్, ఐఏఎస్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఆయనకు ఈ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటివరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్, భూ భారతి వంటి శాఖలకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన రాహుల్‌బొజ్జా, ఐఏఎస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు సిఎస్ ఆ ఉత్తర్వుల్లో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News