Tuesday, April 30, 2024

నవీన్ రెడ్డి ఒక సైకో.. ఏదోలా నన్ను పొందాలని యత్నాలు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. అయితే విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి ఒక సైకో అంటూ మండిపడింది డాక్టర్ వైశాలి. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తనను ఏ విధంగానైనా పొందాలని ప్రయత్నించాడని ఆరోపించింది. 100 మందితో వచ్చి తనను ఎత్తుకెళ్లాడని తెలిపింది. తనను ఏదో చేయాలని ప్రయత్నించాడని, తన ఫ్రెండ్స్‌తో కలిసి తాను గోవా వెళ్లానని వైశాలి వెల్లడించింది.

తాను ఎక్కడెక్కడికి వెళ్లానో ఆ ప్లేసులన్నీ చెప్పి మార్ఫింగ్ ఫోటోలు తయారు చేయించాడని ఆమె ఆరోపించింది. తనను బినామీగా ప్రొజెక్ట్ చేస్తున్నాడని తాను ఎవరికీ బినామీగా లేనని డాక్టర్ వైశాలి కన్నీటి పర్యంతమైంది. తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, నవీన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ వుందని, ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేసింది.

ఇక శనివారం డాక్టర్ వైశాలి మీడియాతో మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ నవీన్ రెడ్డితో పరిచయమైందన్నారు హెల్ప్ అని అరుస్తుంటే చాలా ఘోరంగా ట్రీట్ చేశారని చెప్పారు. నవీన్‌తో తనకు ఫ్రెండ్‌షిప్ మాత్రమే వుందని, తన కెరీర్ నాశనం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ రెడ్డితో తనకు పెళ్లి జరగలేదని వైశాలి క్లారిటీ ఇచ్చారు. కారులో గోళ్లతో గిచ్చారని, కొరికారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రిని చంపేస్తానని బెదిరించారని, ఇష్టం లేదన్నా వినిపించుకోలేదని డాక్టర్ వైశాలి తెలిపారు.

తానంటే ఇష్టమని చెబితే.. పేరెంట్స్‌తో మాట్లాడాలని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు వ్యక్తులు వున్నారని వైశాలి తెలిపారు. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి తన ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్‌మెంట్‌లో వున్నానని వైశాలి రెడ్డి చెప్పారు. తనతో పది మంది దారుణంగా ప్రవర్తించారని, ఆ పది మంది పట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆమె తెలిపారు. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి తనపై చేయి చేసుకోలేదని వైశాలి కన్నీటి పర్యంతమయ్యారు. తనను కాకుండా వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావని ఘోరంగా కొట్టాడని ఆమె తెలిపారు.

పెళ్లికి, ప్రేమకు నో చెప్పానని రోజూ తన ఇంటి ముందుకు వచ్చి న్యూసెన్స్ చేసేవాడని తెలిపారు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని వుంటే ఇప్పుడు ఈ ఘటన జరిగేది కాదన్నారు. అంతమంది వున్నప్పుడే తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, తనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేశారు. తన ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకోవాలని చూశాడని, తాను ఒప్పుకోకపోవడంతో తనపై దుష్ప్రచారం మొదలుపెట్టాడని ఆమె ఆరోపించారు. నవీన్ అతని ముఠాను కఠినంగా శిక్షించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News