Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 1,916 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

New 1916 Corona Cases in Andhra Pradesh

అమరావతి: ఎపిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 22,670 మందికి పరీక్షలు నిర్వహించగా 1,916 కరోనా పాజిటివ్ కేసులు, 43 మరణాలు నమోదయ్యాయని ఎపి ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో స్థానికంగా 1,908 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఎపిలో మొత్తం కేసుల సంఖ్య 33,019కి చేరింది. ఇందులో  ప్రస్తుతం 15,144 యాక్టివ్ కేసులుండగా… 17,467 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 408కి చేరింది. ఎపిలో ఇప్పటివరకు 11 లక్షల 95,766 టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి.

New 1916 Corona Cases in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News