Saturday, May 4, 2024

భారం లేకుండా ఛార్జీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. విద్యుత్తు ఛార్జీల పెంపు భారాన్ని ప్రజలపై మోపలేదని, డిస్కంలకు అవసరమైన అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోందని విద్యుత్ నియంత్రణ మండ లి చైర్మన్ టి.శ్రీరంగారావు వివరించారు. 12,718 కోట్ల రూపాయల ట్రూ ఆప్ ఛార్జీల నిధులను రాష్ట్ర ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించేందుకు అంగీకరిం చిందని మీడియాకు వివరించారు. వ్యవసాయాని కి ఉచిత విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే నిధు లను, గృహ విద్యుత్‌లో ప్రజలపై మోపాల్సిన భా రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోం దని, మొత్తం 9,124 కోట్ల 82 లక్షల రూపా యల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తోంద ని వివరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి చ్చే ఉచిత విద్యుత్‌కు 7,743 కోట్ల 80 లక్షలు, గృ హ విద్యుత్తుకు 1,381 కోట్ల 2 లక్షల రూపాయల ను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. ఇలా ఈ రెండు రకాల సబ్సిడీలతో ప్రజ లు మోయాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.

202324 విద్యుత్ రిటైల్ సప్లైయ్ టారీఫ్‌పై శుక్రవారం నిర్వహించిన మీడియా స మావేశంలో శ్రీరంగారావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజలపై భారాలు మోపేందుకు అంగీకరించలేదన్నారు. వేసవి వచ్చినా 16 వేల మెగావాట్ల కరెంటు ఇస్తామనడం మంచిదేనని, కానీ పొదుపుగా వాడుకోవాలని వినియోగదారుల కు సూచిస్తున్నానన్నారు. అదే సమయంలో ఆయ న విద్యుత్ శాఖకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరెంటు బిల్లింగ్ తక్కువగా చేసిన చోట పూర్తి స్థాయిలో వసూలు చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని శ్రీరంగా రావు వెల్లడించారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట వినియోగ దారులపై భారాలకు పెంచుకోకుండా ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని ట్రాన్స్‌కో, జెన్‌కో డిస్కంలు, సింగరేణి కి సూచిస్తున్నట్లు శ్రీరంగా రావు వెల్లడించారు. ప్రజలపై భారం వేయవద్దన్న లక్షంగానే రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలను భరించేందుకు ముందుకు వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్ల పాటు రూ. 12,718 కోట్లు అది కూడా వడ్డీతో సభా డిస్కంలకు అందించనున్నట్లు తెలిపిందన్నారు. ఈ క్రమంలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయన్నారు. అదే సమయంలో ఇక నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు తమ అంతర్గత సామర్ధాన్ని పెంచుకుని సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. అంతే తప్ప భారాలు ప్రభుత్వం నుంచి ఆశించవద్దని శ్రీరంగా రావు హితవు పలికారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, దేవాలయాల బిల్లులను కొంత మేర తగ్గించిందన్నారు.

విద్యుత్తు సంస్థల ఖర్చు రూ.52,006 కోట్లు

విద్యుత్ సంస్థలకు అవసరమైన నిధులు, ఆదాయం, ఖర్చులకు సంబంధించి కూడా ఈఆర్‌సి ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ రంగానికి మొత్తం 52,006 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈఆర్‌సి అనుమతించింది. విద్యుత్ సంస్థలు 54 వేల 58 కోట్ల 35 లక్షల నిధులు అవసరం అవుతాయని ఈఆర్‌సికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. కాగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు యాధావిధిగా అమలవుతాయి. ఇటు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగానికి మొదటి 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ ధర ఒక రూపాయి 95పైసల ఛార్జీని వసూలు చేస్తారు. 51వ యూనిట్ నుంచి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 3.10 పై వసూలు చేసుకునేందుకు వీలుగా డిస్కంలకు ఈఆర్‌సి అనుమతి ఇచ్చింది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులకు మొదటి వంద యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 3.40 పై వసూలు చేసుకోవచ్చు.

101 వ యూనిట్ నుంచి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 4.80 పైల చొప్పున ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. 200 యూనిట్లకు పైగా కరెంటును వాడుకునే వినియోగదారులకు మొదటి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 5.10 పైసలు ఛార్జీలు వసూలు చేస్తారు. 201 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 7.70 పైసలు అలాగే 301 నుంచి 400 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9 గా ఛార్జీలను నిర్ణయించారు. 401 నుంచి 800 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9.50 పైసలుగాను అలాగే 800 యూనిట్లు ఆ పైన కరెంటును వినియోగించుకునే వినియోగదారుల నుంచి రూ. 10 చొప్పున వసూలు చేసేలా ఈఆర్‌సి విద్యుత్ ఛార్జీల శ్లాబ్‌లను ఖారారు చేసింది. వాణిజ్య రంగంలో విద్యుత్తు వాడుకునే వారికి మొదట 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్ ధర రూ. 7, అలాగే మొదటి 100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 8.50 పైసలకు కరెంటును సరఫరా చేస్తారు. కమర్షియల్ విద్యుత్తు సరఫరాలో 101 నుంచి 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 9.95 పైసలుగాను, 301 నుంచి 500 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 11 గాను ఈఆర్‌సి ఖరారు చేసింది.

ఇందులోనూ హెయిర్ కటింగ్ సేలూన్లకు మూడు రకాల విద్యుత్ ఛార్జీలను ఈఆర్‌సి ఖరారు చేసింది. సెలూన్లకు మొదటి 50 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్‌కు రూ. 5.30 పై.లు, 51 నుంచి 100 యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 6.60 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 7.50 పై.లుగాను ఛార్జీలను ఈఆర్‌సి ఖారారు చేసింది. పరిశ్రమలకు యూనిట్ కాస్ట్ రూ. 7.70 పై.లు, సీజినల్ పరిశ్రమలకు యూనిట్ ధర రూ. 8.40 పై.లు, షుగర్‌కేన్ క్రషింగ్, రోయ్యల చెరువులకు యూనిట్‌కు రూ. 6.20 పై.లు , పౌల్ట్రీ ఫామ్స్‌కు రూ. 7, గొర్రెలు, మేకల ఫాంలకు యూనిట్ ధరగా రూ. 7.30 పై.లుగా , ఇతర కాటేజీ పరిశ్రమలకు రూ. 4 గాను ఛార్చ్ చేస్తారు.

కాగా కార్పొరేట్ వ్యవసాయం చేసే రైతులకు యూనిట్ ధర రూ. 2.50 పైసలుగాను, ఉద్యానవనాలకు యూనిట్ ధర రూ. 4 గాను, పంచాయతీలు, వీధి లైట్లకు రూ. 7 గాను, మున్సిపాలిటీలకు రూ. 7.60 పై.లుగాను , పురపాలక పట్టణాల్లోని వీధి లైట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 8.10 పై.లుగాను నిర్ణయించారు. కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24లో విద్యుత్ కొనుగోలులో యూనిట్ ధర రూ. 4.39 పైసలకు తగ్గిందని ఈఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు సబ్సిడీ కింద 9వేల 124 కోట్ల 22 లక్షల రూపాయలను భరించనుందని ఈఆర్‌సి తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగానికి సబ్సిడీగా 7743 కోట్ల 80 లక్షల రూపాయలను సబ్సిడీగా విద్యుత్ సంస్థలకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈఆర్‌సి తెలిపింది. గృహ విద్యుత్‌పైన కూడ తెలంగాణ ప్రభుత్వం 1381 కోట్ల 2 లక్షల రూపాయల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఈఆర్‌సి తెలిపింది. గత ఏడాది 8221 కోట్ల రూపాయల సబ్సిడీగా భరించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో 9124 కోట్ల 82 లక్షల రూపాయలను భరించనుందని ఇది గత ఏడాది కంటే 11 శాతం అదనంగా సబ్సిడీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని ఈఆర్‌సి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News