అమరావతి: విజయవాడ నగరంలో కలకలం రేపిన బిటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్యకేసు మరో మలుపు తిరిగింది. మృతురాలు దివ్య, నాగేంద్ర ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. కొన్నిరోజుల కిందట వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర సోదరుడు చెబుతున్నాడు. వీరిద్దరి పెళ్లి యువతి కుటుంబానికి ఇష్టం లేదు. పెళ్లి విషయం తెలిసిన తర్వాత దివ్యను గృహనిర్భందం చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి నాగేంద్రతో దివ్య తండ్రి గొడపడినట్లు స్థానికులు తెలిపారు. అయితే దివ్య, నాగేంద్ర ఇద్దరు ప్రేమించుకున్నారన్నది క్లారిటీ లేదని పోలీసులు చెబుతున్నారు. దివ్య మెడ, పొట్టమీద కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. దివ్య ఇంట్లో ఫ్యాన్కు చీరకట్టి ఉందని, అది ఎవరూ ఎందుకు కట్టారో విచారిస్తున్నామని తెలిపారు.
దివ్య హత్యలో మరో కోణం..
సంచలనం రేపిన దివ్యతేజస్విని హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. దివ్య గొంతు తాను కోయలేదని చెప్పాడు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని, ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని పేర్కొన్నాడు. అనంతరం తాను స్పృహ తప్పిపడిపోయాని, ఆ తర్వాత తన చేతిని ఎవరు కోశారో అర్ధం కాలేదని వాపోయాడు. లాక్ డౌన్ లో మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి విషయం దివ్య తల్లిదండ్రులకు తెలుసు. పెళ్లి తర్వాత దివ్వ తల్లిదండ్రులు మమ్మల్ని విడదీశారు. దివ్య కూడా తన తల్లిదండ్రులు చెప్పినట్టే చేసింది. దివ్యచొరవతోనే మా మధ్య పరిచయం ఏర్పడింది. పెళ్లిచేసుకుందామని దివ్వనే కోరింది. మరోసారి ఆలోచించుకోమని దివ్యకు చాలాసార్లు చెప్పానని నాగేంద్ర పేర్కొన్నాడు.
New twist in Divya Tejaswini murder case