Friday, April 26, 2024

అమెరికాలో హుజూరాబాద్ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

Nikhil dead in America

 

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిఖిల్ అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందాడు. హుజూరాబాద్‌లోని విద్యానగర్ కాలనీలో జగన్ మోహన్ రావు- లక్ష్మి కుమారుడు నిఖిల్ రావు ఎంఎస్ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లాడు. చదువు పూర్తి చేసిన అనంతరం అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతూరుకు వస్తే అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. హెచ్1బి వీసా ఆలస్యంకావడంతో అక్కడే ఉండిపోయాడు. జనవరి 17న అనారోగ్య సమస్యలతో నిఖిల్ మరణించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిఖిల్ మృతదేహం వారంలో రోజుల్లో హైదరాబాద్‌కు చేరుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News