Monday, April 29, 2024

యువతిపై అత్యాచారం.. కాలువలో పడేసి రాళ్లతో కొట్టారు…

- Advertisement -
- Advertisement -

Woman raped by Bus driver and conductor in meerut

 

భోపాల్: ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను మురికి కాలువలో పడేసి రాళ్లతో దాడి చేసిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతూల్ జిల్లా ఉమారియా ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేనుకు వెళ్లిన కూతురు చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తరువాత ఆమె ఇంటికి రాకపోవడంతో యువతి కోసం వెతుకుతున్నారు. మురికి కాలువలో నుంచి అరుపులు వినపడడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యుల సమాచారం మేరకు స్థానిక పోలీస్ అధికారి మహేంద్ర చౌహాన్ అక్కడికి చేరుకున్నాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. తనపై అత్యాచారం చేసిన అనంతరం కాలువలో పడేసి రాళ్లతో దాడి చేశారని యువతి పోలీసులకు తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నాగ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడి చికిత్స పొందుతుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం సజీవంగా భూమిలో పాతి పెడుదామని అనుకున్నానని విచారణలో తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News