పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపేవరిదో మొదటి విడత పోలింగ్ తోనే తేలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ లోని చాప్రా, సమస్తిపూర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… నితిశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడి అంశంలో విపక్షాలపై మోడీ మరోసారి విమర్శలు గుప్పించారు. దాడిని తామే చేశామని అంగీకరిస్తూ పాకిస్థాన్ ప్రకటన దేశంలో బీహార్ అమరసైనికుల త్యాగాలు లెక్కచేయని వారి ముసుగులను తొలగించిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రయత్నించే ఇలాంటి వారితో ఓటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మోడీ సూచించారు. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని అది ఇద్దరు యువరాజుల కూటమని ఆరోపించారు. అదే సమయంలో ఎన్డీఏ కూటమి రెండు ఇంజన్లతో అభివృద్ధి దిశగా పనిచేస్తుందన్నారు. వారి ద్యాసంతా సొంత కుటుంబ కోసమేనని ప్రధాని మోడీ విమర్శించారు.
Nitish Kumar will form Government Again Says PM Modi