Saturday, April 27, 2024

సర్వేకు ససేమిరా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం షాక్ ఇచ్చింది. గోదావరి నదిలో నీటి లభ్యతపైన సర్వే చే యాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను కేంద్ర జల సంఘం (సిడబ్లుసి)లోని హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ తెలుగు రాష్ట్రాల డిమాండ్లను తోసిపుచ్చారు. ఈ మేరకు మంగళవారం జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జి.ఆర్.ఎం.బి) సమావేశంలో న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నిత్యానందరాయ్ నీటి లభ్యతపై సర్వేకు నిర్దంధ్వంగా తిరస్కరించారు. గోదావరి నదిలో ఎంత నీరుందనే అంశాలపై గతంలోనే స ర్వేలు చేశామని, ఆ మేరకు భాగస్వామ్య రాష్ట్రాల కు నీటి కేటాయింపులు చేయడం జరిగిందని, ఇ ప్పుడు మళ్ళీ రీ సర్వే చేయడమంటే భాగస్వామ్య రాష్ట్రాలతో తమకు (కేంద్రానికి) ఇబ్బందులు వ స్తాయని, అందుచేతనే తమ పరిధిలో నిర్ణయం తీ సుకొని సర్వే చేయడం కుదరదని సి.డబ్లు.సి. హై డ్రాలజి డైరెక్టర్ కరాఖండిగా చెప్పినట్లుగా తెలిసిం ది.

అంతేగాక ఒకవేళ గోదావరి నదిలోని నీటి ల భ్యతపై తప్పకుండా రీ సర్వే చేయించాలని మీరు (తెలుగు రాష్ట్రాల అధికారులు) గట్టిగా భావిస్తే కేంద్ర జల సంఘం చైర్మన్‌కు ప్రత్యేకంగా లేఖ రా సుకోండని ఉచిత సలహాను ఇచ్చారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అయితే కేంద్ర జల సంఘం పరిధిలోని హైడ్రాలజి విభా గం సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని, గోదావరి నదీ భాగస్వామ్య రాష్ట్రాలతో ఇబ్బందులు వ స్తాయనే కుంటిసాకు మినహా మరే ఇతర సహేతుకమైన కారణాలు చెప్పలేదని తెలుగు రాష్ట్రాల అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. నీటి లభ్యతపై ఎప్పుడో 1970వ దశకంలో జస్టిస్ బచావత్ అవార్డు సమయంలో జరిపిన సర్వేనే దిక్కుగా ఉం ది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ నీటి లభ్యత లో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయనే సాంకేతికపరమైన అంశాలను కూడా గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న మొత్తం నదిలో ఏకంగా 23 టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జి.ఆర్.ఎం.బి) చేసిన ప్రతిపాదనలను తెలంగాణ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.మురళీధర్‌ల సారధ్యంలోని అధికారుల బృందం తిరస్కరించింది.

నది పొడవునా 23 టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, అయిదు చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు బోర్డు సమావేశంలో తెగేసి చెప్పారు. ఎందుకంటే అడుగడుగునా టెలిమెట్రీలను ఏర్పాటు చేయడం, వాటి వల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన గోదావరి నదీ జలాలను నూటికి నూరు శాతం వాడుకోలేకపోతున్నామని, తెలంగాణ రాష్ట్రానికి జస్టిస్ బచావత్ అవార్డులో కేటాయించిన నీటినే వరదల సీజన్‌లో కోల్పోతున్నామని, అదనంగా నీటిని వాడుకునే పరిస్థితులే లేనప్పుడు అనవసరంగా టెలిమెట్రీలను ఏర్పాటు చేసుకోవడం ఎందుకు? అని అధికారులు బోర్డును నిలదీసినట్లు తెలిసింది. పైగా గత వానాకాలం సీజన్‌లో వచ్చిన వరదల సమయంలోనే అందుబాటులో ఉన్న వాటర్ గేజ్‌లు కరెక్టుగానే నీటి ప్రవాహాన్ని తెలియజేశాయని, ఎక్కడా తడబాటు జరగలేదని కూడా అధికారులు బోర్డుకు స్పష్టంచేశారు. దీనికితోడు సమావేశంలో తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖాధికారులకు మధ్య వాదోపవాదాలు జరిగినట్లు తెలిసింది.

తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించతలపెట్టిన మోదికుంటవాగు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన గూడెం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఆ రాష్ట్ర ఇంజనీర్-ఇన్-చీఫ్ నారాయణరెడ్డిలు అనడంతో తెలంగాణ అధికారులు కూడా గట్టిగానే జవాబిచ్చినట్లు తెలిసింది. తమకు కేటాయించిన నీటిలో నుంచే ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించుకొంటున్నామని, ఈ ప్రాజెక్టుల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నష్టం ఉండదని కూడా తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ప్రాజెక్టుల వివరాలు, తగిన సమాచారాన్ని బోర్డుకు ఇంతకు ముందే అందజేశామని, అంతకు మించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.మురళీధర్ తెగేసి చెప్పారని తెలిసింది. ఈ రెండు చిన్న ప్రాజెక్టుల మూలంగా ఎపికి నీరు అందకుండా పోతుందని ఆ రాష్ట్ర అధికారులు చేసిన వాదనలో పసలేదని అన్నారు.

ప్రతి ఏటా గోదావరి నది నుంచి సగటున 2,800 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, గత వానాకాలం సీజన్‌లోనైతే ఏకంగా 7,900 టిఎంసిల రికార్డుస్థాయిలో గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిశాయని, ఏపీ ప్రభుత్వానికి చేతనైతే ఆ నీటిని మొత్తాన్నీ వాడుకోవాల్సింది కదా… ఎందుకు వదిలేశారు? అని తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు ధ్వజమెత్తారు. ఏపీ అధికారుల వాదనలు ఎలా ఉన్నాయంటే వృధాగా సముద్రంలో కలిసినా వారికి అంగీకారమేగానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకుంటే మాత్రం అడ్డుపడుతుంటారని, ఈ విషయాలను బోర్డు పెద్దలు కూడా అర్ధంచేసుకోవాలని కూడా ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలిసింది. గోదావరిలో మరో 3000 టిఎంసిలు మిగులు ఉందని వివరించారు.

అందుకే పసలేని ఏపీ వాదనలను పక్కనబెట్టి తమ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్‌లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ సి.ఎస్ రజత్‌కుమార్, ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ గోదావరి బోర్డుకు, కేంద్ర జల సంఘంకు చెందిన హైడ్రాలజి డైరెక్టర్‌లను కోరారు. సకాలంలో క్లియరెన్స్‌లు ఇవ్వకపోతే ప్రాజెక్టుల ఖర్చు భారీగా పెరిగిపోతుందని, ఈ విషయాలను బోర్డు, సి.డబ్లు.సి. అధికారులు గమనంలో ఉంచుకోవాలని అధికారులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News