Saturday, May 4, 2024

మిజోరం అసెంబ్లీ ఎన్నికలు.. 173 నామినేషన్ల చెల్లుబాటు

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటేనని ధ్రువీకరించింది. విపక్షపార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లోర్రయిన్ లాల్ పెక్లియాన్ నామినేషన్‌లో కొన్ని తేడాలు కనిపించినందున తిరిగి పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల కంటే ఈసారి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తగ్గింది. ఐదేళ్ల క్రితం 212 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి 209 మంది బరిలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) , విపక్ష జేపీఎం, కాంగ్రెస్‌పార్టీ మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. బీజేపీ 23 మందిని పోటీ లోకి దింపింది. ఆప్ అభ్యర్థులు నలుగురు పోటీ చేస్తుండగా, 27 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News