Saturday, April 27, 2024

స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Notification Release For TS Local Body MLC Elections

9 ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానాలకు ఎన్నికలు
ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ
డిసెంబర్ 10న పోలింగ్.. 14న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్నికలు

హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎంఎల్‌సి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎంఎల్‌సి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా, డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు స్థానాలు ఉండగా, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ,మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్‌సిలుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పదవీ కాలం జనవరి 4వ తేదీతో పూర్తి కానుంది.

తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీలోగా కొత్త వారిని ఎంఎల్‌సిలుగా ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఎంఎల్‌సి ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News