Friday, April 26, 2024

భార్యను 72 ఏళ్ల వృద్ధుడు కత్తితో పొడిచి… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Old man killed wife after suicide at tamilnadu

చెన్నై: 72 ఏళ్ల వృద్ధుడు తన భార్యను చంపిన అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని చెన్నై నగరం పెరుగ్‌నాలాతూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జగన్నాథమ్(72), సులోచన(62) అనే వృద్ధ దంపతులు డేవిడ్ నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఉన్న ముగ్గుకు కూతుళ్లకు పెళ్లి కావడంతో ఒంటరిగా ఉంటున్నారు. జగన్నాథమ్ మెకానిక్‌గా పని చేసేవాడు. ఆదివారం 11 గంటల ప్రాంతంలో పక్కింటి వాళ్లు టెర్రస్ మీదకి వెళ్లి చూడగా జగన్నాథమ్ వాటర్ పైప్‌కు ఉరేసుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా సులోచన రక్తపు మడుగులో కనిపించడంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని కూతుళ్లకు సమాచారం ఇచ్చారు. జగన్నాథమ్ తన భార్యను కత్తితో పొడిచి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News