Friday, April 26, 2024

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Died after Tractor Turns over in Wanaparthy

వనపర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలంలో విలియన్‌ కొండ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలులోని కొడుమూరులోని ఉరుకొండకు చెందిన 30మంది కూలీలు, సంగారెడ్డిలో పత్తి ఏరడానికి ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌లో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

One Died after Tractor Turns over in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News