- Advertisement -
జమ్ము: మంగళవారం జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో లష్కర్ఎతాయిబాకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాది నుంచి ఓ ఎకె47 తుపాకీ, నాలుగు మేగజైన్లు, ఓ గ్రెనేడ్, కొంత భారత కరెన్నీ జప్తు చేశామని రక్షణ వర్గాలు తెలిపాయి. నిఘా సమాచారంతో బెహరంగాలా ప్రాంతంలో పోలీసులతో కలిసి సైన్యం గాలిస్తుండగా ఉగ్రవాది కాల్పులు జరిపాడని ఆ వర్గాలు తెలిపాయి. తమ ఎదురు కాల్పులో చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్ధాన్కు చెందిన అబూజరారాగా గుర్తించామని రక్షణవర్గాలు తెలిపాయి. మరో ఉగ్రవాది తప్పించుకోగా, గాలింపు కొనసాగిస్తున్నామని తెలిపాయి. సమీపంలోని అడవిని స్థావరంగా చేసుకున్న ఉగ్రవాదులు తమ కనీస అవసరాలైన ఆహారం, తాగునీరులాంటివాటి కోసం స్థానికుల్ని బెదిరిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
One Terrorist killed in Encounter in Poonch
- Advertisement -