Friday, April 26, 2024

ఉగ్ర కుట్ర భగ్నం.. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు

- Advertisement -
- Advertisement -

Ongoing police inspections in Adilabad district

హైదరాబాద్: ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. హరియాణాలో దొరికిన నలుగురు ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్‌ ఉట్నూర్‌ మీదుగా నాందేడ్‌కు ఆర్డీఎక్స్‌ సరఫరా చేయాలని ఉగ్రవాదులకు ఆదేశాలు ఉండటంతో సోదాలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని 2 ప్రాంతాల్లో పోలీసుల సోదాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మల్‌, భైంసా మీదుగా నాందేడ్‌ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు నాందేడ్‌ నుంచి ఢిల్లీ వెళ్లే రూట్లను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News