Wednesday, May 1, 2024

ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై ఆన్‌లైన్ క్విజ్.. 10 లక్షల వరకు బహుమతుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజలలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పలు కార్యక్రమాలకు నిర్వహిస్తోంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ క్విజ్ ను ప్రారంభించారు. శుక్రవారం పిసిబి కార్యాలయంలో పర్యావరణ హితమైన వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు పౌరులు.. విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్విజ్ పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా మట్టి గణేష్ విగ్రహాల ఏర్పాటులో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించి.. రూ.10 లక్షల వరకు బహుమతులు అందజేయనున్నారు. ప్రతి జిల్లాకు మొదటి బహుమతి రూ.10వేలు, రెండో బహుమతి రూ.5వేలు, మూడో బహుమతి రూ.3వేలు ఇస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు పర్యావరణ హితమైన వినాయకుడి పండుగని జరుపుకోవడం, క్విజ్ పూర్తయిన తరువాత ప్రతిజ్ఞ చేయాలి. పాల్గొనే వ్యక్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వబడ్డ మెయిల్ ఐడికి ఒక ఈ -సర్టిఫికేట్ పంపనున్నారు.

అదే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులతో బహుమతులు పంపిణీ చేయనున్నారు. వివరాలకు www.tspcb.cgg.gov.in ద్వారా క్విజ్ ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్విజ్ 2023 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీ పర్యావరణ హితమైన వినాయక ఉత్సవాలను నిర్వహించడం, మట్టి వినాయకుడి విగ్రహాన్ని సరిగ్గా ఉంచడం, పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నిషేధించడం, శబ్ద కాలుష్యాన్ని నివారించడం ద్వారా నిర్వహకులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News