డిఫరెంట్ కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. 18 మిలియన్ యూజర్స్తో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ తెలుగు ఓటీటీ యాప్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ‘ఆహా’కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తమన్నా, సీరత్ కపూర్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్రాజుతో పాటు అల్లు బాబీ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఫిబ్రవరిలో ‘ఆహా’ను ప్రారంభించినప్పుడు ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది లోపు 4060 ప్రోగ్రామ్స్ను ప్లాన్ చేశాం. అయితే కరోనా రావడంతో నేను ‘ఆహా’ ఆఫీస్కి వెళ్లలేదు. జూమ్లోనే కథలు వింటూ వచ్చాను. ఇక దీపావళి టు దీపావళికి ‘ఆహా’ ప్లాన్ చేసిన పలు ప్రోగ్రామ్స్లో పది ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ గురించి చెబుతాను. అందులో మొదటిది సామ్జామ్ టాక్ షో. సమంత హోస్ట్ చేస్తున్నారు.
అలాగే లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్, కమిట్మెంటల్, మా వింత గాథ వినుమా, అనగనగా ఓ అతిథి వంటి ప్రోగ్రామ్స్తో ప్రేక్షకులను అలరిస్తాం”అని అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఆహాను నెంబర్ వన్ తెలుగు ఫ్లాట్ఫామ్గా మార్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఓటీటీ కోసం నేను, త్రివిక్రమ్ కలిసి ఓ యాడ్ చేశాం. అంతేకాకుండా నాతో కలిసి పనిచేసిన నలుగురు దర్శకులు ‘ఆహా’లో షోలు చేస్తున్నారు. సుకుమార్ ఓ అద్భుతమైన షో చేయబోతున్నారు. అలాగే హరీష్ శంకర్ కూడా ఓ షో చేస్తున్నారు. సురేందర్ రెడ్డి ఓ షో చేస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి ‘ఆహా’ కోసం ఓ షో చేస్తున్నారు”అని పేర్కొన్నారు. తమన్నా మాట్లాడుతూ “తెలుగు ఓటీటీ ‘ఆహా’లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్ కంటెంట్తో ‘లెవెన్త్ అవర్’ చేయడం హ్యాపీగా ఉంది”అని చెప్పారు.