Saturday, May 4, 2024

హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు..

- Advertisement -
- Advertisement -

వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ టీమ్ బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. పాకిస్థాన్ తన ఆరంభ మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. కివీస్ టీమ్ ఇప్పటికే హైదరాబాద్ చేరింది. తాజాగా పాక్ కూడా నగరానికి వచ్చేసింది. హయాత్ హోటల్‌లో పాక్ టీమ్‌కు బస కల్పించారు. ఉప్పల్‌లో పాకిస్థాన్ వార్మప్‌లతో పాటు వరల్డ్‌కప్ మ్యాచ్‌లను కూడా ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News