Monday, May 13, 2024

ఎపిలో యువతిపై పెట్రోల్‌తో దాడి.. నిందితుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Patrol attack on young woman in andhra pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిలా నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో ప్రేయసిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ అఘాయిత్యాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో ప్రేయసితో పాటు అక్క, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ దిశ యాప్ కాల్ ద్వారా తమకు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. 8 నెలల క్రితం రాములమ్మను రాంబాబు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, బాధితురాలికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని నిందితుడు కక్ష పెంచుకున్నాడని చెప్పారు. బాధితురాలు రాములమ్మపై గురువారం నాడు అర్ధరాత్రిపూట నిందితుడు పెట్రోల్ పోసి హత్య చేసే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించటంతో బాధితురాలిని కాపాడగలిగామన్నారు. నిందితున్ని అరెస్ట్ చేశామని, ఏడు రోజులలో చార్జ్‌షీట్ వేస్తున్నామని ఎస్పీ దీపికా పాటిల్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News