Saturday, May 4, 2024

అభిమానుల మరణం మాటలకు అందని విషాదం: పవన్

- Advertisement -
- Advertisement -

Pawan condolence on his fans dead

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు భారీ కటౌట్ కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతం శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో 25 అడుగుల బ్యానర్ కడుతుండగా విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. మృతులు సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. గుండెల నిండా తన పట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు అభిమానులు మృతి చెందడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది మాటలకు అందని విషాదం అని, మృతుల ఆత్మకు శాంతి చేకూరలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. గాయపడిన హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్‌లకు మెరుగైన చికిత్స అందించాలని జనసేన నాయకులకు పవన్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News