Tuesday, May 14, 2024

గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర కావాలి: పవన్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan Press Meet at Tirupati

అమరావతి: రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. జైకిసాన్ పేరుతో రైతులకోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రైతులకు అండగా ఉండేలా ఓ ప్రణాళికతో ముందుకువెళ్తామని చెప్పారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి.. రైతులకు లాభసాటి ధర వచ్చేలా కార్యాచరణపై చర్చిస్తామని జనసేనాని సూచించారు. తుఫాన్ నష్ట పరిహారం రైతుకు 35వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ప్రతి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”రైతులు మేలు కోసమే బిజెపి సర్కార్ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చింది. లోటుపాట్లు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలి. ఢిల్లీలో కేంద్రం రైతులతో చర్చలు జరుపుతోంది.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు

Pawan Kalyan Press Meet at Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News