- Advertisement -
హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ లో రీపోలింగ్ గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 30.26 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 69 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్యాలెట్ పేపర్ లో పార్టీ గుర్తులు తారుమారు కావడంతో పాత మలక్ పేట్ లో రీపోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నిర్వహించిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో మొత్తం 46.55శాతం పోలింగ్ నమోదైంది.
30.26 per cent polling till 3 pm in Old Malakpet
- Advertisement -