Monday, April 29, 2024

పెన్‌గంగ మహోగ్రరూపం ….! 

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు, ఐదు రోజులుగా వర్షాలు కుస్తుండటంతో నదులతోపాటు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే ఎగువన కురుస్తున్న అతి భారీ వర్షాలతో పాటు మహారాష్ట్రలోని వరదతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. జైనాథ్ మండలంలోని డొలారా దగ్గర 50 అడుగుల ఎత్తున ఉన్న బ్రిడ్జిని తాకుతూ నది ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ 44వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. శనివారం రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో రాకపోకలను నిలిపి వేసిన అధికారులు ఆదివారం మధ్యాహ్న సమయంలో పెన్‌గంగా ఉధృతి కొద్దిమేర తగ్గగానే వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు.

ఒక్కో వాహనాన్ని ఆ బ్రిడ్జిపై నుంచి పంపడంతో భారీగా ట్రాఫిక్ జాం అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 కిలో మీటర్ల వరకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మహారాష్ట్రకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదివారం ఉదయం వరకు 4లక్షల 80వేల క్యూ సెక్కుల నీటి ప్రవాహం ఉండగా మధ్యాహ్న సమయం వరకు 1 లక్షల క్యూసెక్కుల నీరు తగ్గడంతో ఆ బ్రిడ్జిపై నుండి వాహనాలకు అనుమతిచ్చారు. అయితే శనివారం రాత్రి నుంచి వాహనాలు నిలిపివేడయంతో ప్రయాణికులు గంటల తరబడి వాహనాల్లో ఉండిపోవల్సి వచ్చింది. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీస్‌శాఖ అధికారులు ప్రయాణికులకు వాటర్ ఫ్యాకెట్లను అందజేశారు. రాకపోకలకు అనుమతిచ్చిన దాదాపు నాలుగు, ఐదు గంటల వరకు ట్రాఫిక్ క్లీయర్ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News