- Advertisement -
హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని డిఎంఇ రమేష్ రెడ్డి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి అవుతోందని, కరోనాను లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. మాటిమాటికి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పిహెచ్సికి వెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని తెలియజేశారు.
- Advertisement -