- Advertisement -
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నూతన వ్యవసాయం చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో…. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే ఎల్లప్పుడూ గొప్పదని మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్ తెలిపారు. భారతీయ రైతులు నిరంతరం ఉద్యమం చేసి సాధించుకున్నారని కెటిఆర్ ట్వీట్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ రైతులకు మద్దతు తెలిపుతూ ముగించారు. గత సంవతరం నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -