- Advertisement -
అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సర్కార్ దవాఖానకు తరలించారు. పాత కక్షలతోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకాతెలియాల్సి ఉంది.
Person Was Brutally Murdered in Guntur District
- Advertisement -