Thursday, May 16, 2024

ఫోన్ బ్యాంకింగ్ నుంచి డిజిటల్ బ్యాంకింగ్ కు : మోడీ

- Advertisement -
- Advertisement -

Narendra Modi

న్యూఢిల్లీ: 2014కు ముందు ఉన్న ‘ఫోన్ బ్యాంకింగ్’ స్థానంలో ‘డిజిటల్ బ్యాంకింగ్’ కోసం బిజెపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. గత యుపిఎ హయాం గురించి ప్రస్తావిస్తూ, ‘ఫోన్ బ్యాంకింగ్’ కింద,  ఎవరికి రుణాలు ఇవ్వాలి , ఏ నిబంధనలు,  షరతులకు సంబంధించి ఫోన్‌లో బ్యాంకులకు సూచనలు ఇవ్వబడ్డాయన్నారు.

75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డిబియు) దేశానికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతి ప్రత్యక్షంగా బ్యాంకింగ్ వ్యవస్థ బలంతో ముడిపడి ఉంటుందన్నారు.బ్యాంకింగ్ రంగం సుపరిపాలన , మెరుగైన సేవల పంపిణీకి మాధ్యమంగా మారింది, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) లీకేజీలను అరికట్టడానికి, పారదర్శకతను తీసుకురావడానికి సహాయపడిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు డిబిటి ద్వారా రూ. 25 లక్షల కోట్లను బదిలీ చేసిందని, పిఎం-కిసాన్ పథకం కింద మరో విడతను సోమవారం బదిలీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

డిబియులకు సంబంధించి, ఇవి మరింత ఆర్థిక చేరికను, పౌరులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా డిబియూలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని 11 బ్యాంకులు, ప్రైవేట్ రంగంలో 12 మరియు ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకు ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నాయి. డిబియులు  సేవింగ్స్ ఖాతా తెరవడం, ఖాతా బ్యాలెన్స్ చెక్, ప్రింటింగ్ పాస్‌బుక్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంట్స్, లోన్ అప్లికేషన్‌లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు వంటి అనేక రకాల డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తాయి,  బిల్లు, పన్ను చెల్లింపులు వంటి సేవలు కూడా అందిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News