- Advertisement -
న్యూఢిల్లీ: ఆధునీకరించిన పినాకా రాకెట్ పరీక్ష విజయవంతమైందని డిఆర్డిఒ తెలిపింది. ఒడిషా చాందీపూర్ తీరంలోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం ఈ పరీక్ష నిర్వహించామని డిఆర్డిఒ ట్విట్ చేసింది. వరుసగా ఆరు రాకెట్లను ప్రయోగించగా అవి నిర్దిష్ట లక్షాలను ఛేదించాయని అధికారులు తెలిపారు. వీటి రేంజ్ 37 కిలోమీటర్లు. ప్రస్తుతం ఆపరేషన్లలో ఉపయోగిస్తున్న పినాకా ఎంకె1 రాకెట్ల స్థానంలో తాజాగా అభివృద్ధిపరిచిన ఈ రాకెట్లను సైన్యానికి అందించనున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణశాఖ శాస్త్రవేత్తలు పలు రకాల క్షిపణులను రెండు నెలలుగా పరీక్షిస్తున్నారు.
- Advertisement -