Sunday, April 28, 2024

విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

pm modi condoles loss of lives in vijayawada fire accident

న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదంపై సిఎం జగన్ కు ప్రధాని ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి వివరించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అయితే ప్రమాద సమయంలో హోటల్ లో 30మంది కరోనా రోగులతో సహా 10మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News