- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని రైతు విరోధిగా రాహుల్ అభివర్ణించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. కొత్త బిల్లు రైతులకు కనీస మద్దతు ధరపై ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోయిందని విమర్శలు గుప్పంచారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే ప్రయత్నాలను ఈ దేశం ఎన్నటికీ సఫలం కానివ్వదు అని రాహుల్ ట్వీట్ చేశారు.
PM Modi make Farmers will turn slaves says Rahul
- Advertisement -