Friday, April 26, 2024

కరోనా కట్టడిపై రాష్ట్రాల సిఎంలకు ప్రధాని ఫోన్

- Advertisement -
- Advertisement -

PM Modi speaks to CM of Maharashtra

న్యూఢిల్లీ: కరోనా కట్టడిపై గత మూడ్రోజులుగా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మరో నలుగురు సిఎంలతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ సిఎంలకు ఫోన్ చేసిన మోడీ ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావాన్ని ఆరాతీశారు. వైరస్ కట్టడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని కేంద్రం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామని ఆ రాష్ట్ర సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు హామీ ఇచ్చారు. మహారాష్ట్రకు మరింత ఆక్సిజన్ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. అటు దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.

PM Modi speaks to CM of Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News