Saturday, April 27, 2024

ఐడీఎఫ్‌ డబ్ల్యుఎస్‌–2022ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi to Inaugurate IFDS-2022 on Sep 12

న్యూఢిల్లీ: ఈ నెల 12వ తేదీన ఐడీఎఫ్‌ వరల్డ్‌ డే సదస్సు 2022ను గ్రేటర్‌ నోయిడా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పాల పరిశ్రమలో అగ్రగామి నాయకులు, నిపుణులు, రైతులు, పాలసీ ప్లానర్లు పాల్గొనడంతో పాటుగా ‘పౌష్టికాహారం, జీవనోపాధి కోసం పాల ఉత్పత్తులు’ అనే అంశంపై చర్చించనున్నారు.

ఈ సదస్సులో గౌరవనీయ కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్‌ షాతో పాటుగా కేంద్ర పశు సంవర్థక, డెయిరింగ్‌, మత్య్సశాఖామాత్యులు పర్షోత్తమ్‌ రూపాలా కూడా ప్రసంగించనున్నారు. వీరితో పాటుగా ఇంటర్నేషల్‌ డెయిరీ ఫెడరేషన్‌ (ఐడీఎఫ్‌) అధ్యక్షులు పియర్‌ క్రిస్టియానో బ్రజాల్‌; కారోల్‌ ఎమ్నాడో, డైరెక్టర్‌ జనరల్‌, ఐడీఎఫ్‌; శ్రీ జితేందర్‌ నాథ్‌ స్వైన్‌, ప్రెసిడెంట్‌, ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ఐడీఎఫ్‌ (ఐఎన్‌సీ– ఐడీఎఫ్‌) మరియు సెక్రటరీ, డీఏహెచ్‌డీ, మీనేష్‌ షా, సెక్రటరీ, ఐఎన్‌సీ – ఐడీఎఫ్‌ మరియు ఛైర్మన్‌ ఎన్‌డీడీబీ ఈ కార్యక్రమానికి సమన్వయం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ పటేల్‌ కూడా పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 24 సెషన్స్‌ పౌష్టికాహారం మరియు జీవనోపాధి కోసం పాల ఉత్పత్తులు నేపథ్యంతో జరుగనున్నాయి. వీటికి సమాంతరంగా మూడు టెక్నికల్‌ సదస్సులు సైతం జరుగుతాయి. మొత్తంమ్మీద 150 మందికి పైగా దేశీ, విదేశీ స్పీకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

PM Modi to Inaugurate IFDS-2022 on Sep 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News