Friday, April 26, 2024

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -
Police Case registered against Teenmar Mallanna
ఫిర్యాదు చేసిన టిఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటిఆర్ కుమారుడిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టింగ్ పెట్టిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై బంజారాహిల్స్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న ట్వీట్‌పై టిఆర్‌ఎస్ సోషల్ మీడియా టీం బంజారాహిల్స్ ఎసిపికి ఫిర్యాదు చేసింది. మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షుపై పెట్టిన పోస్టును చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు టిఆర్‌ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్నపై దాడికి పాల్పడ్డారు. ట్వీట్‌పై మంత్రి కెటిఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజేపి మీడియా థర్డ్‌గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వాక్ స్వాతంత్రం ఉందని, భావవ్యక్తీకరణ పేరుతో ఇతరులపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం సరికాదన్నారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కెటిఆర్ హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News