దుబ్బాకః నవంబర్ 03న జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాజక్కపేట, చెల్లాపూర్, గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కేంద్ర బలగాలు, సీఆర్ఫీఎఫ్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్, సాయుధ దళాలు, లోకల్ పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
డబ్బులు ఆశచూపిన, మద్యం డబ్బులు పంచినా, నేర పూరిత చర్యలకు పాల్పడిన ప్రజలు, యువకులు స్పందించి వెంటనే సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. డయల్ 100 తోపాటు సీపీ వాట్సాప్ నంబర్ 790110010, దుబ్బాక ఉప ఎన్నిక నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ, 7901640499, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్ 9490617009, గజ్వెల్ ఏసీపీ నారాయణ 8333998684, తుఫ్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్ 9490617008, కంట్రోల్ రూం నంబర్ 8333998699కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో సీఆర్ఫీఎఫ్ డీఎస్పీ ప్రసాద్, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ రఫీక్, సీఆర్పీఎఫ్ సిబ్బంది సాయుధ దళ సిబ్బంది సివిల్ పోలీసులు పాల్గొన్నారు.