Sunday, April 28, 2024

వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారు: అంజనీ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్‌లు, శానిటైజర్లు అందించారని సిపి అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారని, లాక్‌డౌన్ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు కిట్లు అందజేశామన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 700కు చేరుకోగా 18 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా వైరస్ 13,664 మందికి సోకగా 450 మంది చనిపోయారు. కరోనా నుంచి 1793 మంది కోలుకున్నారు.

 

Police more work less than Doctors in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News