- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపిఎస్సి) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ -2020 వాయిదా పడింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను ఎప్పుడు నిర్వహిస్తామనేది మే 20వ తేదీన ప్రకటిస్తామని యూపిఎస్సి అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మే 31వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎగ్జామ్ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
Postponement of UPSC Civil Prelims Exam
- Advertisement -