- Advertisement -
దుబాయ్ : అరబ్ ఎమిరేట్స్లో భారతీయ సేల్స్మేన్ ఒకరు అబుధాబి బిగ్టికెట్ డ్రాలో 10 మిలియన్ల దిర్హాములు (2.7మిలియన్ డాలర్లు) గెల్చుకున్నారు. కేరళ లోని త్రిసూర్కు చెందిన దిలీప్కుమార్ ఎల్లిక్కొట్టిల్ పరమేశ్వరన్కు ఈ డ్రా వచ్చింది. అజ్మన్లో ఆటోస్పేర్ పార్టుల కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు. నెలకు 5000 దిర్హాములు(1361 డాలర్లు) సంపాదిస్తున్నారు. ఈ డ్రాలో వచ్చిన పెద్దమొత్తంతో పరమేశ్వరన్ 700,000 దిర్హాముల (1,90,574 డాలర్లు ) రుణం తీరుస్తానని చెప్పారు. మిగతా డబ్బుతో తన ఇద్దరు పిల్లల చదువులకు వెచ్చిస్తానని అన్నారు. గత 17 ఏళ్లుగా అజ్మన్లో ఆయన తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ బిగ్టికెట్ అన్నది అబుధాబిలో భారీ సుదీర్ఘ నెలవారీ రాఫిల్ నగదు బహుమతుల డ్రా. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రతినెలా 3 న నిర్వహిస్తుంటారు.
10 million dirhams reward for Indian winner
- Advertisement -