- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి ఆరా తీశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోవింద్ ఆకాంక్షించారు. పాఠశాల విద్యావిధానంపై రేపు నిపుణులతో వెబ్ నార్ ఏర్పాటు చేసినట్టు గవర్నర్ తెలిపారు. కొత్త విద్యావిధానంపై ఈ నెల 7న రాష్ట్రపతి వీడియో కాన్పెరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో గవర్నర్లు, రాష్ట్రాల విద్యామంత్రులు, వర్సిటీల వైస్ చాన్స్లర్లు పాల్గొననున్నారు. తెలంగాణలో వివిధ కార్యక్రమాలు చేపట్టిన తమిళిసైని రాష్ట్రపతి అభినందించారు.
President ramnath kovind phone to governor tamilisai
- Advertisement -