Monday, April 29, 2024

రాజ్‌నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి లేఖ

- Advertisement -
- Advertisement -

mp revanth reddy wrote a letter to rajnath singh

హైదరాబాద్: తన నియోజకవర్గంలోని పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆర్మీ అధికారులు దాదాపు 20 రోడ్లను మూసేశారని ఫిర్యాదు చేశారు. రోడ్లు బంద్ చేయడంతో తన నియోజకవర్గంలోని సుమారు 10 లక్షల మంది ఇబ్బందిపడుతున్నారని, దయచేసి రోడ్లు తెరిపించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక మిలిటరీ అధికారులను ఆదేశించాలని కోరారు. అంతేకాకుండా ఆ రోడ్లను తెరవాలంటూ గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రతులను కూడా రేవంత్ రెడ్డి తన లేఖకు జోడించారు.

MP Revanth Reddy Wrote Letter To Rajnath Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News