Wednesday, May 15, 2024

గ్రామీణ, వ్యవసాయానికే ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో రైతులకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు: నిపుణులు

Priority is given to agricultural areas

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తయా రీ, సేవల రంగాలు డీలాపడగా, వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం దేశీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. దేశం లో ఎక్కువ జనాభా వ్యవసాయం, సాగుపైనే ఆధారపడ్డా యి. వ్యవసాయ రంగంలో మెరుగుదల కోసం కొత్త చట్టా ల తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో చర్యలు ఉంటా యి. నేడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 202122 ప్రధానంగా గ్రామీ ణ పేదలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టనున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, సేవల రంగం వరుసగా 9.6 శాతం, 8.8శాతం పడిపోయాయి. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో వ్యవసాయ రంగం, దాని అనుబంధ సంస్థల వృద్ధి రేటు ఇప్పటికీ 3.4 శాతమే ఉంది.

Upcoming budget 2021 will be introduced on Feb 1

బడ్జెట్ ఎలా సిద్ధం అవుతుంది?
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమర్పిం చే బడ్జెట్ 2021-22 ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి బడ్జెట్ పూర్తిగా పేపర్‌లెస్‌గా ఉంది. డిజిటల్‌గా విడుదల అవుతుంది. సాధారణంగా బడ్జెట్ తయారీ ప్రక్రి య 5 నెలల ముందుగానే మొదలవుతుంది. ఇది చాలా సమావేశాల తరువాత తయారు చేస్తారు.
బడ్జెట్ అంటే ఏమిటి?
ఇంటిని నడపడానికి మనకు బడ్జెట్ అవసరం ఉన్నట్లే, దేశాన్ని నడపడానికి బడ్జెట్ అవసరం. ఇంటి కోసం చేసే బడ్జెట్ సాధారణంగా ఒక నెల ఉంటుంది. దీనిలో ఈ నెల లో ఎంత ఖర్చు చేశాం, ఎంత సంపాదించామనేది ఉంటా యి. అదేవిధంగా దేశ బడ్జెట్ కూడా ఉంటుంది. ఇది ఏడా ది పొడవునా ఖర్చులు, ఆదాయాల గణాంకాలను కలిగి ఉంటుంది.
మూడు రకాల గణాంకాలు
ప్రభుత్వం బడ్జెట్‌లో మూడు రకాల గణాంకాలను ఇస్తుం ది. అవి -బడ్జెట్ అంచనా, సవరించిన అంచనా, వాస్తవమై నది. బడ్జెట్ అంచనా విషయానికొస్తే ఇది వచ్చే ఏడాది, ఈసారి 2021-22 బడ్జెట్ అంచనా వేస్తారు. అంటే దీని లో ప్రభుత్వం 2021-22లో ఆదాయాలు, ఖర్చులను అంచనా వేస్తుంది. సవరించిన అంచనా విషయానికొస్తే ఇది గత సంవత్సరం. ఈసారి బడ్జెట్ సమర్పించబోయేది. 2020-21 సవరించిన అంచనా చెప్తారు. అంటే గత బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన అంచనా ప్రకారం, అది ఎంత సంపాదించింది, ఎంత ఖర్చు చేసింది. సవరించిన అంచ నా బడ్జెట్ అంచనా కంటే తక్కువగా ఉండవచ్చు. ఇక వాస్త వం విషయానికొస్తే ఇది రెండేళ్ల క్రితం, ఈసారి 2019-20 బడ్జెట్‌ను బడ్జెట్‌లో పేర్కొంటారు. అంటే 2019–20 లో ప్రభుత్వం వాస్తవానికి ఎంత సంపాదించింది. ఖర్చు చేసింది ఉంటుంది.
బడ్జెట్ ముందు ఏమి జరుగుతుంది
బడ్జెట్ తయారీ 5 నెలల ముందుగానే ప్రారంభమవుతుం ది. సాధారణంగా సెప్టెంబరులో ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సర్క్యులర్లను జారీ చేస్తుంది. ఇందులో అవసరమైన నిధులను సూచించమ ని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి వారి ఖర్చులను అంచ నా వేయమని అడుగుతారు. దీని తరువాత అక్టోబర్-నవంబర్లలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖ లు, విభాగాల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.
రాష్ట్రపతి అనుమతి అవసరం
పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి అనుమతి అవసరం. రాష్ట్రపతి ఆమోదం తరువాత దానిని మంత్రివర్గం ముందు ఉంచి పార్లమెంటు ఉభయ సభల లో ప్రవేశపెడతారు. బడ్జెట్ సమర్పించిన తరువాత పార్లమెంటు ఉభయ సభలలో అంటే లోక్‌సభ, రాజ్యసభలలో ఆమోదించాలి. రెండు సభల నుండి వెళ్ళిన తరువాత ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది. దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News