Monday, April 29, 2024

ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో…

- Advertisement -
- Advertisement -

Sarkari vari pata

 

బ్లాక్‌బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ గ్యాప్ తీసుకొని ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రారంభించాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను దుబాయ్‌లో మొదలుపెట్టారు. ప్రస్తుతం చిత్రబృందం దుబాయ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ “దుబాయ్ నగరంలో సురక్షితంగా షూటింగ్ జరుగుతుందని భావిస్తున్నాను. సుందర ప్రదేశమైన దుబాయ్‌ని నేను గతంలో చాలాసార్లు సందర్శించాను.

షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా సిబ్బంది కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు”అని చెప్పారు. ఇక మహేష్‌బాబు ప్రస్తుతం తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి దుబాయ్ నగరంలో ఉంటున్నాడు. దుబాయ్‌లో షెడ్యూల్ జరిగినన్ని రోజులపాటు ఫ్యామిలీతో ఉంటాడట ఈ సూపర్‌స్టార్. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్, తమన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News