Saturday, April 27, 2024

పవర్‌ఫుల్ పాత్రలో…

- Advertisement -
- Advertisement -

హీరో అక్కినేని నాగచైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు, -తమిళ ద్విభాషా చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్ళింది. ‘ఎన్‌సి 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. నాగచైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా ‘ఎన్‌సి 22’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం మేక ర్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరింత ఉత్సాహాన్ని పెంచుతూ మేకర్స్ శుక్రవారం ‘ఎన్‌సి 22’ తారాగణాన్ని పరిచయం చేశారు.

సినిమాలో భాగమైన ప్రముఖ నటీనటులను ప్రకటించారు నిర్మాత లు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి పవర్‌ఫుల్ పాత్రలని పోషిస్తున్నారు. ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటీనటులు కూడా తారాగణంలో చేరారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News